కాల్వశ్రీరాంపూర్, మార్చి 22: బావులు ఎండడం..భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలను కాపాడేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊషన్నపల్లెకు చెందిన చందిన ముస్కు అనంతరెడ్డి ఎకరం భూమిలో మక్క సాగు చేశాడు.
వ్యవసాయ బావి ఎండిపోవడంతో కంకి విడిచే దశలో నీరందక మక్క చేను వడలిపోయింది. దీంతో అనంతరెడ్డి ట్యాంకర్ ద్వారా నీరందిస్తూ అరిగోసపడుతున్నాడు. వారానికోసారి రూ. 4 వేలు వెచ్చించి ట్యాంకర్ ద్వారా నీళ్లు పెడుతున్నామని చెప్పాడు. అయినా పంట చేతికందడం కష్టమేనని, పెట్టిన పెట్టుబడి కూడా రాదేమోని ఆవేదన వ్యక్తం చేశాడు.