సుల్తానాబాద్ రూరల్, ఫిబ్రవరి 9: ఆయిల్ పామ్ వైపు రైతులు అడుగేసి అధిక దిగుబడి సాధించాలని తెలంగాణ ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ వెంకటరాంరెడ్డి పిలుపునిచ్చారు. చిన్నబొంకూర్ అనుబంధ గ్రామం రెబ్బల్దేవుపల్లి శివారులో తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీలో పంట సాగుపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెంకటరాంరెడ్డి హాజరై అయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వెంకటరాంరెడ్డి మాట్లాడారు. ఇలాంటి పంటల సాగు రైతులకు కొత్తగానే ఉంటుందని, 1990లోనే ఆయిల్ పామ్ వచ్చిందన్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలు ఆయిల్పాంకు అనుకూలంగా ఉంటాయనే ఆలోచనతోనే ఈ పంటపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇక్కడ ఐఓపీఆర్ శాస్త్రవేతలు రాంచంద్రుడు, విజయకృష్ణ, కరీంనగర్ డీటీహెచ్ బండారి శ్రీనివాస్, పెద్దపల్లి ఉద్యానశాఖ అధికారి జగన్మోహన్రెడ్డి, ఏడీహెచ్ లహరి,సర్పంచులు రమేశ్గౌడ్, రాజు, సింగిల్ విండో చైర్మన్ మహిపాల్రెడ్డి, హెచ్వోలు జ్యోతి, శ్రీకాంత్, మంజువాణి, శ్యాంప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ మహిపాల్రెడ్డి, తిరుమల ఆయిల్ కేం ఇండియా సీఈవో కేష్కళ్యాణ్, సిబ్బందితో పాటు పలు గ్రామాల రైతులు, తదితరులు ఉన్నారు.