వ్యవసాయంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో పంట దిగుబడి అధికంగా తీయాలనే ఉద్దేశంతో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో నేలలోని పోషకాలలో సమతుల్యం లోపించి ఉత్పాదక శక్తి తగ్గుతున్నది. ఫలితంగా చీడపీడలు ఆశించడం, సూక్ష్మపోషకాల లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు భూసారం దెబ్బతింటున్నది. ఈ క్రమంలో సేంద్రియ, పశువుల ఎరువు నేలకు, పంటలకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
– తిమ్మాపూర్, జూన్ 25
పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది. ఇండ్లలో ఏడాది కాలంగా ఉన్న పశువుల పెంట, చెత్త – చెదారం పూర్తిగా కుల్లిపోతుంది. దీనిని పొలాల్లో వేయడం వల్ల నేలలో సారం పెరుగుతుంది. అలాగే కోడి, మేకల ఎరువులతోపాటు వ్యవసాయ భూముల్లో మందలు పెట్టించడం వంటి పద్ధతులతో భూ సారంతోపాటు పంటల దిగుబడి పెరుగుతుంది.
తకువ పెట్టుబడితో అధిక లాభాలు
ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పేడ పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతాయి. దుకులు దున్నుకునే ముందే పంట పొలాల్లో వేసుకొని, దున్నితే మంచిది. తకువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఒకో ఎకరానికి మూడు నుంచి ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును ఉపయోగించాలి. సేంద్రియ ఎరువు, పశువుల పేడ పంటల పొలాల్లో వేస్తే సహజ సిద్ధమైన లవణాలు పంటకు అందుతాయి.
నత్రజని, భాస్వరం
పశువుల పేడ వేసిన తర్వాత భూమిని కలియదున్నితే నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు, సూక్ష్మ పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. మొక బాగుండి మంచి దిగుబడి పొందవచ్చు. అలాగే, చెరువుల్లో పూడిక తీసిన సమయంలో వచ్చే నల్ల మట్టిని వ్యవసాయ భూమిలో పోయించుకుంటే భూసారం పెరగుతుంది. ఇది నీటిని ఎకువగా పీల్చుకొని నేలలో చాలా సమయం వరకు తేమ ఉండేటట్టు చేస్తుంది. దీంతో మొకకు నీటి లభ్యత ఎల్లప్పుడూ ఉంటుంది.
భూసారం పదిలం
రైతులు వేసవిలో పశువుల ఎరువును పొలాల్లో పోస్తుంటారు. అదే సమయంలో ఎండలు ఎకువగా ఉంటాయి. దీంతో పొలంలో వెదజల్లితే వాటిలోని పోషకాలు ఆవిరవుతాయి. కాబట్టి, పశువులు పేడను పొలంలో కుప్పలుగా పోసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉన్న సమయంలోనే వెదజల్లి దుకిలో కలియదున్నాలి. దీని వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రియ ఎరువు భూమిలోని ఆమ్లాలు, క్షారాల స్థాయిని నిలబెడుతుంది. మంచి సూక్ష్మ జీవుల వృద్ధికి తోడ్పడుతుంది.
ఇలా దుకిదున్నాలి..
దుకిని ఎలా పడితే అలా దున్నడం వల్ల సాగు చేసే పంటలకు నష్టం వాటిల్లుతుంది. మెట్ట ప్రాంతాల్లో భూమి వాలుకు అడ్డంగా దుకి చేయాలి. ప్రస్తుతం వచ్చే అధిక వర్షాలకు ఎంతో సారవంతమైన మట్టి వరదకు వాలు ప్రాంతంలో కొట్టుకుపోతుంది. వాలుకు అడ్డంగా దుకి దున్నితే నీటి ప్రవాహం తగ్గి మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది.
పంట దిగుబడి పెరుగుతుంది
రసాయన ఎరువుల వాడకం తగ్గించి, రైతులు సేంద్రియ ఎరువులు వాడాలి. పశువుల పేడ పంటలకు ఎంతో మేలు చేస్తుంది. భూమిలో భూసారం పెరిగి పంటలు బాగా పండుతా యి. భూమిలో నీటిని నిల్వ చేసుకునే శక్తి పెంచుతుంది. తేమను ఆరకుండా చేసి మొకలకు నీటిని అందిస్తుంది. పంటలకు సైతం మంచి పోషకాలు అంది అధిక దిగుబడి వస్తుంది. పశువుల, కంపోస్టు, వర్మీ, పచ్చిరొట్ట, ఇతర సేంద్రియ ఎరువులను కూడా వాడవచ్చు. పంటలు వేసేముందు అధికారులు సలహాలు, సూచనలు పాటించాలి.
– సురేందర్, వ్యవసాయ అధికారి, తిమ్మాపూర్