వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఓవైపు కూలీల కొరత వెంటాడుతుండగా, మరోవైపు సమయం ఆదా కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వస్తున్న యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మక్కలు, పత్తి, పల్లి విత్తులు నాటేందుకు యంత్రం రాగా, ఓదెల మండలం కొలనూర్కు చెందిన రైతు పర్శ మధు తన చేనులో మొదటిసారి బుధవారం దీని ద్వారా మక్కలు నాటాడు.
దీని ధర రూ.15 వేలు. ఎకరం మక్క విత్తనాలు నాటేందుకు నలుగురు కూలీలు అవసరం కావడంతో పాటు ఒక రోజు పడుతుంది. ఇందుకు రూ.2 వేల వరకు ఖర్చవుతాయి. ఇదే యంత్రం ద్వారా అయితే, మూడు గంటల్లో ఎకరంలో విత్తనాలు నాటవచ్చని రైతు మధు చెబుతున్నాడు.
-ఓదెల, జనవరి 11