కొత్తపల్లి, నవంబర్ 13: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ గెలుపే లక్ష్యంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, యువజన విభాగం నాయకులు, అభిమానులు విస్త్రృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పట్టణంలోని 48, 49, 50వ బూత్ల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్తో పాటు కొత్తపల్లి పట్టణంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గున్నాల రమేశ్, మానుపాటి వేణుగోపాల్, పొన్నం శ్రీనివాస్ , పద్మ పాల్గొన్నారు. అలాగే మండలంలోని మల్కాపూర్లో నియోజకవర్గ యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, యూత్ గ్రామ అధ్యక్షుడు కొకు భరత్ ఆధ్వర్యంలో గ్రామంలోని 35వ బూత్లో గడపగడపకూ ప్రచారం చేశారు. గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధ్దే ఆయనకు నాలుగోసారి విజయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జీకే యూత్ అధ్యక్షుడు గొల్లపెల్లి అరుణ్, పల్లాటి నవీన్, కూన అంకూస్, నవీన్, బత్తిని విక్రం, నగేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, నవంబర్13: జీకే యూత్ గౌరవ అధ్యక్షుడు గంగుల ప్రదీప్కుమార్ ఆధ్వర్యంలో గంగుల కమలాకర్ గెలుపే లక్ష్యంగా సర్పంచ్ చామనపల్లి అరుణ, రాజయ్య, గ్రామ నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి, అత్యధిక మెజార్టితో గంగుల కమలాకర్ను గెలిపించాలని గంగుల ప్రదీప్ కుమార్ కోరారు. కార్యక్రమంలో వార్డుసభ్యుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు గాండ్ల కొమురయ్య, ఆలయ చైర్మన్ నేరెళ్ల అశోక్ పాల్గొన్నారు. కాగా చెర్లభూత్కూర్లో పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నెరెళ్ల శ్రీనివాస్, దుర్శేడ్లో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరామోజు తిరుపతి అధ్వర్యంలో, నాయకులు సుంకిశాల సంపత్రావు, తోట తిరుపతి, చామనపల్లిలో ఎంపీపీ తిప్పర్తి లక్షయ్య ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
గంగుల గెలువాలని ఆలయంలో పూజలు
కార్పొరేషన్, నవంబర్ 13: కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ నాలుగో సారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలువాలని నగరంలోని 3వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు సోమవారం కిసాన్నగర్లోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమ డివిజన్ నుంచి గంగులకు భారీ మెజార్టీ అందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సంపతి అశోక్, మారముళ్ల సాంబయ్య, గడ్డం వీరేందర్, శంకర్, సాయికృష్ణ, సాంబరాజు, లావణ్య, సుల్తాన, దరిపెల్లి అంజయ్య, జల్లి కోటేశ్వర్, రామంచ సతీశ్, దండు మధు, సావనపెల్లి శ్రీనివాస్, సావనపెల్లి నారాయణ, ముదుంపెల్లి ఆంజనేయులు, సారంపెల్లి రమేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ మద్దతు
కలెక్టరేట్, నవంబర్ 13: శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలికోట సత్యనారాయణచారి సోమవారం నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. స్వపరిపాలనలో గోల్డ్ అప్రైజర్స్ పరిస్థితులు మెరుగుపడ్డాయని హర్షం వ్యక్తం చేశారు. 2014కు ముందు తక్కువ కమీషన్ మాత్రమే అందజేసిన బ్యాంకులు, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కమీషన్ శాతం పెంచడంతో తమ ఇబ్బందులు తీరాయన్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, గోల్డ్ అప్రైజర్స్కు ఉజ్వల భవిష్యత్తు అందిస్తాడనే భావనతో తమ సంఘం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోల్డ్ అప్రైజర్స్ జిల్లా శాఖలకు ఇప్పటికే సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని పలు బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న గోల్డ్ అప్రైజర్స్ బీఆర్ఎస్కు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన సిల్ల కుమార్
కమాన్చౌరస్తా, నవంబర్ 13: అల్గునూర్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా 8వ డివిజన్ కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఇందులో భాగంగా 8వ డివిజన్ అల్గునూర్ ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు సిల్ల కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి స్వామిరెడ్డి, జాప రవీందర్రెడ్డి, రాఘవరెడ్డి, కంది రాంచంద్రారెడ్డి, ముదిరాజ్ సంఘం తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు సిల్ల పరశురాం, నాయకులు సిరిసిల్ల అంజయ్య, దానవేణి రాజు, జాప లక్ష్మారెడ్డి, సల్ల మహేందర్, లంక రవి, జీకే ఉపాధ్యక్షుడు తాటికొండ రవి, దీపక్, చిల్ల రాయమల్లు పాల్గొన్నారు.