Amber Kishore Jha | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 6 : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలే నిర్వహణ లక్ష్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలలో భాగంగా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన దుబ్బపల్లి వద్ద వాహన తనిఖీలు చేపడుతున్న స్టాటిక్ సర్వేలేయన్స్ చెక్ పోస్ట్ ను శనివారం సందర్శించారు. వాహన తనిఖీల వివరాల రిజిస్టర్ ను సీపీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను అక్రమ రవాణాకు ప్రయత్నించే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఆ వాహనాల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని చెప్పారు. సిబ్బంది వాహనాలను తనిఖీ సమయంలో తగిన జాగ్రత్త లు రేడియం జాకెట్స్ వేసుకోవాలని, లైట్స్ అందుబాటులో ఉంచుకోవాలని స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎప్పుడు అప్రమత్తం గా ఉండాలని సూచించారు.
పెద్దపల్లి జోన్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని చెక్ పోస్ట్ ల్ వద్ద నిత్యం వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందని సీపీ తెలిపారు. అలాగే గర్రెపల్లి గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ, సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ముందస్తు సమాచారాల్ని సేకరించి ఏలాంటి సంఘటనలు ప్రచారం సమయం, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున, ఫలితాలు వెల్లడించిన తరువాత ఎలాంటి అవాంఛనీయఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు అమలు చేయాలని, ఏ సమాచారం వచ్చినా, వెంటనే స్పందన తప్పనిసరి అని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై, ట్రబుల్ మాంగర్స్ పై 24/7 పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.