సైదాపూర్, జనవరి 24: ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువుకోవాలని జిల్లా సెక్టోరల్ అధికారులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, మండల విద్యా వనరుల కేంద్రాన్ని సోమవారం జిల్లా సెక్టోరల్ అధికారులు, కోఆర్డినేటర్ ఆంజనేయులు, ఏఎస్వో మహేందర్ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్పీలు, ఐఆర్పీలు నిర్వహిస్తున్న బడి మానేసిన పిల్లలు, దివ్యాంగుల సర్వే, ఆన్లైన్ తరగతుల నిర్వహణ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సీఆర్పీ తమ గ్రామ పరిధిలోని బడి మానేసిన పిల్లల వివరాలు గుర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటనరసింహారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఖైరున్నీసాబేగం, సీఆర్పీలు సోయం రమేశ్, చక్రపాణి రమేశ్, శ్రీనివాస్రెడ్డి, ఐఆర్పీలు వెంకటేశ్, సదయ్య, ఎమ్మార్సీ సిబ్బంది మధు, వరలక్ష్మి, శ్యామ్ పాల్గొన్నారు.
బడి బయట పిల్లల సర్వే
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విద్యాశాఖ అధికారులు బడిబయటి పిల్లల సర్వే నిర్వహించారు. గ్రామంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న పిల్లలు, దివ్యాంగులను గుర్తించారు. చదువుకు దూరంగా ఉంటున్న 13మంది పిల్లలను గుర్తించి వారికి స్థానికంగా ఉన్న విద్యావసతుల గురించి వివరించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని వారికి సూచించారు. పాఠశాల ప్రారంభం కాగానే పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంవో శ్రీనివాస్, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, ఐఈఆర్పీ రాపర్తి గణేశ్, సీఆర్పీ రాజ్కుమార్ పాల్గొన్నారు.
కాట్రపల్లిలో..
మండలంలోని కాట్రపల్లి గ్రామంలో సోమవారం బడిబయట పిల్లల సర్వే నిర్వహించారు. మధ్యలో చదువు మానేసిన వారి పేర్లను నమోదు చేసుకుని పాఠశాలకు తిరిగివెళ్లే విధంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిరోషాకిరణ్, సీఆర్పీలు రాజు, రవిబాబు తదితరులు ఉన్నారు.