కరీంనగర్ : పదవులన్నీ అనుభువించి టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ మేయర్ రవీందర్ సింగ్ వ్యాఖ్యలను డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల డా.శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రవీందర్ సింగ్కు కరీంనగర్ మేయర్గా ఎవరి మద్దతు లేకపోయినా అవకాశం ఇచ్చారన్నారు. పదవి అనుభవించిన తర్వాత అన్యాయం జరిగిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రవీందర్ సింగ్ను మేయర్గా, తుల ఉమకు జెడ్పీ చైర్ పర్సన్ గా అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
పార్టీ నుంచి లబ్ధి పొంది పార్టీని విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వీరు వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా జుగుప్సాకరంగా ఉందన్నారు. వీరి వ్యవహారం రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. ఈటల రాజేందర్కు రవీందర్ సింగ్ మౌత్ పీస్ గా పని చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏ పార్టీలు భరించవన్నారు.