IAS Hanumantha Rao | జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు ధార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి మంగళవారం ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కమిషనర్కు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం వారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి కమిషనర్కు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.