ముకరంపుర, జులై 16 : యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కరీంనగర్ సర్కిల్లో ఏడవ రోజుకు చేరింది. విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు, విద్యుత్ ప్లాంట్లలో పనిచేసే ఉద్యోగులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పడే ప్రభావంపై జేఏసీ నాయకులు ఉద్యోగులకు వివరించారు.
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విద్యుత్ ప్లాంట్ల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, వెంకట్ నారాయణ, శ్రీమతి, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.