కరీంనగర్, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘కరెంటు కష్టాలు.. కర్షకుల కన్నీళ్లు’ పేరిట గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ వడ్లకొండ గంగాధర్, డీఈ జే రాజం, ఏడీఈ కొలుపుల రాజు, ఏఈ నరేశ్తో కలి సి నల్లగుంటపల్లె, మొగ్దంపూర్, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల స మస్యలు తెలుసుకున్నారు.
అనంతరం అధికారులు మాట్లా డుతూ, నల్లగుంటపల్లె, ఇరుకుల్ల వాగు పరీవాహక ప్రాంత రైతులు తమ పొలాలు పారించుకునేందుకు వాగు లో బావులు తవ్వుకున్నారని, వంతుల వారీగా బావి నుంచి నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. వాగులో నీరు లేకపోవడంతోపాటు బావుల్లో భూగ ర్భ జలాలు అడుగంటడం పొలాలకు సరిపడా నీరు అందడం లేదన్నారు.
దీంతో బావుల్లో ఊరిన నీరు ఊరినట్లుగా ప్రతి ఒకటి రెండు గంటలకోసారి విరామం ఇచ్చి పొలాలు పారించుకుంటున్నారని తెలిపారు. రైతులకు రేయింబవళ్లు మెరుగైన విద్యుత్ అందించడానికి తమ అధికారులు, సిబ్బంది ఆహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా అవాంతరాలు ఎదురైతే సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.