బోయినపల్లి రూరల్, జూన్ 26 : వ్యవసాయ పంట పొలాల్లో కరెంట్ తీగలు చేతికందేలా వేలాడుతుండడంతో రైతులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. కిందికి వేలాడుతున్న తీగలను సరిచేయాలని సంబంధిత అధికారులకు, స్థానిక సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.
బోయినపల్లి మండలం రత్నంపేటలో కందారపు శ్రీనివాస్ పొలంలో విద్యుత్ తీగలు ఇలా చేతికందేలా వేలాడుతున్నాయి. పొలాల్లోకి వెళ్లాలన్నా, వైర్ల కింద పని చేయాలన్నా ట్రాక్టర్లు, హార్వెస్టర్ల డ్రైవర్లు, కూలీలు బేంబెలెత్తుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వైర్లను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.