కరీంనగర్ తెలంగాణచౌక్, జూలై 3: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు గాశారు. ఈవీ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డిపో-2 చెందిన 140 ఈవీ బస్సులను నిలివేశారు. దీంతో ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
వరంగల్, నిజామాబాద్, గోదావరిఖని, జగిత్యాల పట్టణ ప్రాంతాలకు ఇతర డిపోల నుంచి తీసుకొచ్చిన ఎక్స్ప్రెస్లను వేశారు. జమ్మికుంట, బెజ్జంకి, హుస్నాబాద్, వేములవాడ, ధర్మారం, గ్రామీణ పాంత్రాలకు పల్లె వెలుగు బస్సులను అదనంగా నడిపించారు. అయితే ఈవీ బస్సులు డిపోకే పరిమిత కావడం, ఆ రూట్లలో అదనంగా బస్సలను తిప్పినా సమయానికి బస్సుల్లేక ప్రయాణికులు అవస్థలుపడ్డారు.
వరంగల్ నుంచి నిజామాబాద్కు కొన్ని ఈవీ బస్సులను నడిపించడం, కరీంనగర్లో నిలిపివేయడంతో ఆగ్రహించారు. కాగా, ఈవీ బస్ల ప్రమాదాలకు సంబంధించి నివేదిక వచ్చిన తర్వాతే ఈవీ బస్సుల పునరుద్ధరణ పై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.