సిరిసిల్ల రూరల్, మార్చి 18 : తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని చెక్పోస్టులో సోమవారం ఎన్నికల అధికారులు రూ.లక్ష పట్టుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన స్వామి కారులో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్నాడు.
ఈ క్రమంలో జిల్లెల్ల శివారులోని చెక్ పోస్టులో ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కారులో రూ.లక్ష పట్టుబడింది. సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు 50 వేలకు మించి దగ్గర ఉంచుకోవద్దని, అంతకు మించితే సరైన ఆధారాలు ఉండాలని సూచించారు.