Mallapur Lions Club | మల్లాపూర్, జూన్ 28 : మల్లాపూర్ మండల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు లయన్స్ క్లబ్ ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా రేవెల్లి తిరుపతి (ముత్యంపేట), కార్యదర్శిగా మండ స్వామి (మల్లాపూర్), కోశాధికారిగా కల్లెం నాగిరెడ్డి (సిరిపూర్) లను నియమించినట్లు ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, సభ్యుల సమిష్టి సహకారంతో మండలంలో క్లబ్ సేవలను విస్తృతంగా అందిస్తామాని, తన ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. అనంతరం సీనియర్ నేతలు జువ్వాడి కృష్ణారావు, ఎలాల జలపతిరెడ్డి, వెల్మల శ్రీనివాసరావులు కలిసి నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇక్కడ లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.