Mudimanikyam | చిగురుమామిడి, జూలై 9 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో బీరయ్య స్వామి నవనిర్మాణ కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా కురుమ కుల పెద్ద పెద్ది బుచ్చయ్య, ఉపాధ్యక్షుడిగా గుడిసె లచ్చయ్య, కార్యదర్శిగా పెద్ది చిన్న వీరయ్య, కోశాధికారిగా కాశవేణి రమేష్, ప్రచార కార్యదర్శిగా పెద్ది చిన్న అనిల్, కార్యవర్గ సభ్యులుగా పెద్ది శ్రీకాంత్, బండారి యాదగిరి, పెద్ది ఓదయ్య, కాకల్ల రవిని ఎన్నుకున్నారు.
కమిటీ సలహాదారులుగా పెద్ది శ్రీకాంత్, బండారి యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ బీరయ్య స్వామి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, రాబోయే ఆరు నెలలలో బీరయ్య స్వామి ఉత్సవాలను వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా సహకరించాలని వారు గ్రామస్తులను కోరారు.