చొప్పదండి, నవంబర్ 28 : తాను స్థానికుడినని, అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేశానని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తనను ఆదరించి కారుగుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. చొప్పదండి పట్టణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార, వాణిజ్య, గృహాలపై విధిస్తున్న పన్నులను తగ్గిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తన స్వగ్రామమైన బూరుగుపల్లిలోనే ఉంటున్నాని, ఎక్కడుంటాడో తెలువని హైదరాబాద్లోని కొంపల్లికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రమాదముందని, ప్రజలు గమనించాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని రూ.130 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని, మరోసారి తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే సిరిసిల్ల తరహాలో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, కౌన్సిలర్లు నలుమాచు జ్యోతి-రామక్రిష్ణ, కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్గౌడ్, కౌన్సిలర్ అజ్జు, నాయకులు మహేశుని మల్లేశం, జహీర్, మావురం మహేశ్, ఖాజా పాల్గొన్నారు.