ఇల్లంతకుంట, నవంబర్ 23: బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి పట్టంకట్టాలని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన జంగంరెడ్డిపల్లి, అనంతారం, వల్లంపట్ల, ముస్కానిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించ గా, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సం దర్భంగా రసమయి మాట్లాడుతూ, దొంగ మొ క్కులు, ఆచరణకు సాధ్యంకాని హామీలు ఇస్తూ ప్రజల్లో తిరిగే కాంగ్రెస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
వాళ్లు ఇక్కడ ఇస్తున్న హామీలు వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ హామీలు అమలు చేయడం సాధ్యం కాదనే విష యం వారికి తెలుసనీ, కేవలం అధికార దాహం కోసం మాత్రమే వారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే కరెం టు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నాటి ముఖ్యంత్రి చెప్పాడని, కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు 24గంటలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 55 ఏండ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ చేయని అభివృద్ధిని, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పదేండ్లలోనే చేసి చూపించామన్నారు.
మరోసారి కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, సెస్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అన్నాడి అనంతరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతపల్లి వేణురావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, సర్పంచులు చల్ల నారాయణ, కేతిరెడ్డి అనసూ య, తూంకుంట శ్రీలత, పీఏసీఎస్, ఏఎంపీ డైరెక్టర్లు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.