గోదావరిఖని, నవంబర్ 26: కాంగ్రెస్కు ఓటేస్తే పేదలకు కన్నీళ్లేనని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తూ పేదల పాలిట ఆశాజ్యోతిగా సీఎం కేసీఆర్ నిలిచారని రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ 28,29, 37 డివిజన్లలో ఆయన ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. మహిళలు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను, మేనిఫెస్టను వివరించారు.
ఆయన మాట్లాడుతూ 55 యేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం చీకటిమయమైందన్నారు. ఏలాంటి సంక్షేమం లేకుండా ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడిపారని అన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్ పథకాలను అమలు చేశారన్నారు. సింగరేణిలో వారసత్వ హక్కును పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్దేఅన్నారు. రామగుండంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని అన్నారు. రూ400లకే గ్యాస్ సిలి ండర్, సన్న బియ్యం, బీమా వసతి, సౌభాగ్యలక్ష్మీ సంక్షేమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు కౌశిక హరి, నడిపెల్లి అభిషేక్, కార్పొరేటర్లు పెంట రాజేష్, కొమ్ము వేణు, ఇంజపురి పులెంధర్, నాయకు లు విజయ్, చెల్కలపల్లి శ్రీనివాస్, సురేశ్, నూ నె శరత్, నీలారపు రవి, బాబు, మైస రవి, రవి, శ్రీకాంత్, కిశోర్, తిరుమల్, శ్రీను, సాగ ర్, చింటూ, ఉదయ్, సురేశ్, మల్లేశ్, శ్రీను, రా మలక్ష్మి, మౌనిక, అరుణ, పద్మ, మైస రాజేశ్, మండ రమేశ్, బొల్లెన శ్రీధర్, రాజు పాల్గొన్నారు. అనంతరం 300 మంది పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు.
క్రిస్టీయన్ల సంక్షేమానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు ఆదివరాం స్థానిక మార్కండేయ కాలనీలో క్రిస్టియన్లతో ఆత్మీయ సమ్మేళనం ని ర్వహించారు. ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్నారని వారికి తగిన గౌరవాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు. రామగుండంలో కోటి రూపాయలతో క్రిస్టియన్ల భవన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ సంఘాల నాయకులు ప్రకాష్, జమ్మి బాబు, దివాకర్, లాజరస్, దయానంద్ గాంధీ పాల్గొన్నారు.
అంతర్గాం, నవంబర్ 26: మీ కుటుంబంలో ఒక్కడిగా నేను మీవెంటనే ఉంటున్న దీవించి అసెంబ్లీకి పంపించాలని రామగుండం బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ఓటర్లను అభ్యర్థించారు. శనివారం రాత్రి అంతర్గాం మం డలం ముర్మూర్, ఎల్లంపల్లి గ్రామంలో ము మ్మర ప్రచారం నిర్వహించారు. ప్రజలతో చం దర్ మమేకమయ్యారు. మీ ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా గెలిచి అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ని ర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నియోకవర్గ ఎన్నికల ఇన్చార్జి నారాదా సు లక్ష్మణ్రావు, జడ్పీటీసీ ఆముల నారాయ ణ, కౌశికహరి, సర్పంచ్లు బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, నేతలు కౌశికహరి, తిరుపతి నా యక్, గోపు కొమురయ్య, చిలుక కొమురయ్య, గోపు ఐలయ్యయాదవ్, జిల్లా కోఆప్షన్ మెంబ ర్ దివాకర్, మండల కో ఆప్షన్ మెంబర్ గౌస్పాష తదితరులు ఉన్నారు.