మానకొండూర్రూరల్, సెప్టెంబర్ 2 : ఆసరా పింఛన్ ఎంతో మంది వృద్ధులకు ఆర్థిక భరోసానిస్తున్నది. సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకులా నగదు ఇస్తున్నడని సంబుర పడుతున్నది. ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ సందర్భంగా వాటిని అందుకున్న వృద్ధులు సంతోషంతో దీవిస్తున్నారు.
శుక్రవారం మానకొండూర్ మండలం ముంజంపల్లిలో పింఛన్ మంజూరు పత్రాలు అందుకున్న ఓ వృద్ధురాలు ఆనందంతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను కన్న కొడుకులా ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఆశీర్వదించింది. ‘ముచ్చటగా మూడోసారి నువ్వే మా ఎమ్మెల్యే బిడ్డా’ అంటూ దీవించింది.