అందరికీ అన్నం పెట్టే అన్నదాత కుటుంబాన్ని గౌరవించుకునేలా, పాడి, వ్యవసాయ పశువులతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసేలా కరీంనగర్ మారెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఎడ్లబండితో కూడిన రైతు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటైన మారెట్ కమిటీ పాలకవర్గం అభివృద్ధితోపాటు ప్రత్యేకతను చాటేలా దృష్టి సారించింది. ఈ మేరకు రూ.13 లక్షలతో రైతు ఎడ్లబండి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. మారెట్ ప్రధాన గేటుకు ఎదురుగా ఉన్న ఈ విగ్రహం లోపలికి వచ్చే ప్రతి ఒకరినీ కట్టిపడేస్తుంది.
-ముకరంపుర, జనవరి 16