జగిత్యాల రూరల్, సెప్టెంబర్ 21: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో సర్కారు అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల బీఎల్ఎన్ గార్డెన్స్లో రూరల్ మండలానికి చెందిన 640 మంది, అర్బన్ మండలానికి చెందిన 123 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అలాగే 59 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని చెప్పారు.
కొన్నేండ్ల క్రితం అమలు చేయాల్సిన ఈ స్కీం కరోనా కారణంగా ఆలస్యమైందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, ఆసరా, డబుల్బెడ్రూం పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ చొరవతో జగిత్యాలలో 4520 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించడం అభినందనీయమన్నారు. అనేకమంది నిర్భాగ్యులకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేస్తున్న మనసున్న మారాజు సంజయ్ అని చెప్పారు. పనిచేసే వారిని ఆదరించాలని ప్రజలను కోరారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎనలేనిదన్నారు.
జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ, ఆడబిడ్డలు తిన్నరేవు మరువద్దని.. అన్నం పెడుతున్న కేసీఆర్ను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఎమ్మెల్యే సంజయ్ నిధులు మంజూరు చేయించారని గుర్తుచేశారు. సమావేశానికి ముందు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. సమావేశంలో జడ్పీటీసీ మహేశ్, ఎంపీపీలు ములాసపు లక్ష్మి, రాజేంద్రప్రసాద్, ప్యాక్స్ చైర్మన్లు మహిపాల్రెడ్డి, సందీప్రావు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ నక్కల రవీందర్రెడ్డి, ఎంపీడీవోలు రాజేశ్వరి, శైలజా రాణి, ఎంపీవోలు రవిబాబు, సలీం పాల్గొన్నారు.