రాయికల్, అక్టోబర్ 21: కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావొద్దని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టోకు ఆకర్షితులై ప్రజలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. రాయికల్ మండల ఇటిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చెందిన ఇద్దరు బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్లు, ఇటిక్యాల గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు గ్రామానికి చెందిన అన్ని కులాలకు సంబంధించిన 300 మంది రైతులు, మహిళలు, యువకులు, అలాగే వస్తాపూర్ గ్రామానికి చెందిన గడ్డం తిరుపతిరెడ్డి, అయన కుమారుడు దీపక్రెడ్డి, కిష్టంపేటకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిరిపురం సత్తయ్య శనివారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దండగ అనుకున్న వ్యవసాయ రంగాన్ని తెలంగాణలో పండగలా మార్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. 4కోట్లతో మండల వ్యాప్తంగా ఐదు చెక్ డ్యాములను నిర్మించామన్నారు. 9.5 కోట్లతో రామారావుపల్లెకు వెళ్లే రహదారిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టమన్నారు. బీడీ కార్మికులు, గీతా కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. గ్రామంలో 227 మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి చెకులు పంపిణీ చేశామన్నారు. ప్రతి నెలా పెన్షన్ల రూపంలో గ్రామానికి 21 లక్షలను ఇస్తున్నామన్నారు. 600 మంది బీడీ కార్మికులకు బీడీ పెన్షన్ ఇస్తున్నామన్నారు. 2,200 మంది రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలోని దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం ప్రమాదవశాత్తూ గాయపడిన 7వ వార్డు సభ్యుడు రాజేందర్ భార్యను, అలాగే స్వర్గం రాజారాంను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణిసురేందర్ నాయక్, జడ్పీటీసీ అశ్వినిజాదవ్, పార్టీ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి తలారి రాజేశ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు దొంతి నాగరాజు, సర్పంచ్ సామళ్ల లావణ్య వేణు, గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిపల్లి స్వామిరెడ్డి, ఇటిక్యాల బీఅర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి నాయిని శ్రీనివాస్గౌడ్, మాజీ సర్పంచ్ నీరటి శ్రీనివాస్, గ్రామ సీనియర్ నాయకులు ఉతం సాయగౌడ్, కొల్లూరి వేణురొట్టె శ్రీనివాస్, జోగిని పెళ్లి నారాయణరెడ్డి, కొకెర, చంద్రశేఖర్, సోమన్న, వేల్పుల లక్ష్మణ్, సిరికొండ రాజేందర్, రఘునాథ్, పోతుగంటి శ్రీనివాస్ గౌడ్, రుకుబాయ్, సింగిల్ విండో డైరెక్టర్లు కళ్ళ భూమక, గుండ చంద్రమౌళి పాల్గొన్నారు.