మెట్పల్లి/ఇబ్రహీంపట్నం, నవంబర్ 6: ‘బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నరు. మన వెంటే ఉన్నరు. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని’ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మెట్పల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీజేపీతో పాటు వివిధ యువజన సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే అభ్యర్థి డా సంజయ్ కల్వకుంట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కండువాలు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంజయ్ కల్వకుంట్ల మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, మరోసారి అధికారంలోకి వస్తే చేపట్టే పథకాల గురించి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మాజీ సభ్యుడు లింగంపల్లి సంజీవ్, కుతుబొద్దీన్పాషా, తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కందకంగడ్డ మున్నూరుకాపు యువజన సంఘ సభ్యులు, రాయల్ యాదవ్ యువజన సంఘ సభ్యులు, మైనార్టీ యువజన సంఘ సభ్యులు 130మందితోపాటు మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గన్నవేని అశోక్, జిల్లా యూత్ నాయకుడు పిట్టల వంశీ, యామాపూర్లో మాజీ ఉపసర్పంచ్ కనుక నగేష్, 50మంది సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కల్వకుంట్ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
ఈ సందర్భంగా సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆ హ్వానించారు. ఇక్కడ వైస్ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎలాల దశరథ్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నేమూరి సత్యనారాయణ, నాయకులు రెబ్బటి రాజేందర్, కంఠం రమేశ్, జగన్రావు, నేరెళ్ల దేవేందర్, చిన్నారెడ్డి, సుమన్, ఆనంద్, మహేశ్, రమేశ్, వినోద్ ఉన్నారు.