మల్లాపూర్, నవంబర్ 23: ‘నేను మీ బిడ్డను. మీ వెంటే ఉంటా.. తోడై నిలుస్తా. ఒకసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని’ కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. గురువారం ఓబులాపూర్ ఎస్టీ తండా, ఓబులాపూర్, సంగెం-శ్రీరాంపూర్, కొత్తదాంరాజ్పల్లి, పాతదాంరాజ్పల్లి, వాల్గొండ, వాల్గొండ ఎస్టీ తండ, కుస్తాపూర్, రత్నాపూర్, సిరిపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించారు. ఆయా చోట్ల మాట్లాడారు. తెలంగాణ రాక ముందు గ్రామాలు ఎలా ఉండేవో.. ప్రస్తుతం ఎలా ఉన్నాయో..? ఆలోచించాలని సూచించారు.
గ్రామాల్లో పుట్టి పెరిగిన సీఎం కేసీఆర్కు ప్రజల కష్టాసుఖాలన్నీ స్పష్టంగా తెలుసునని, అందుకే గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గ్రామాల్లోని కార్యకర్తలు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై చర్చ పెట్టాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని పేర్కొన్నారు. అనంతరం పలు గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి సుమారు 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి దేవర సురేష్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మైదాస్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి, ఆర్బీఎస్ జిల్లా డైరెక్టర్ దేవ మల్లయ్య, సర్పంచులు భుక్య రజిత, అలిశెట్టి రవి, పాలెపు దిలీప్, బద్దం సరిత, దరంసోత్ కళావతి, దండిక గంగు, సరికెల లక్ష్మీ, భూక్య గోవింద్నాయక్, ఎంపీటీసీలు క్యాతం సుజాత, దేవ ముత్తమ్మ, మాజీ ఎంపీపీలు బద్దం నర్సారెడ్డి, నల్ల రాజన్న పాల్గొన్నారు.