జగిత్యాల, సెప్టెంబర్ 9: మతతత్వ పార్టీలను నమ్మొద్దని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని ఓర్వలేక, వారు చేసింది చెప్పలేక కుల, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. శుక్రవారం రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యుడు ముఖీద్ ఆధ్వర్యంలో అల్లీపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రవేని ఆశాలు, అనుచరులు 30 మందికి పైగా బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే సంజయ్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కంటే తెలంగాణలో ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పా రు.
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు 12 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు, 1.50లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని, ఈ ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. యువకులను రెచ్చగొట్టడం మాని ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని బీజేపీ నేతలకు సూచించారు. ఇక్కడ పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, రాయికల్ పట్టణాధ్యక్షుడు ఇంతియా జ్, జిల్లా కౌన్సిలర్ల అధ్యక్షుడు ఫోరం పం బాల రామ్ కుమార్, కౌన్సిలర్ అల్లే గంగ సాగర్, నాయకులు ఎర్రవేని తిరుపతి, జాన గంగాధర్, వెంకటేశ్వర్ రావు, వినోద్ రావు, జహంగీర్, దాసరి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు దుమాల రాజ్ కుమార్, కార్మిక వి భాగం నేత తొలిప్రేమ శ్రీనివాస్, యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు, యూత్ మండలాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సుంకె మహేశ్, ఎస్టీ విభాగం శ్రీరామ్ భిక్షపతి, ఢిల్లీ రామారావు ఉన్నారు.