నిత్యం బస్సుల్లో ప్రయాణిస్తూ.. డిపోల్లో మరమ్మతులు చేస్తూ తీరిక లేకుండా గడిపే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది రిలీఫ్ కోసం సంస్థ వినూత్నంగా వనభోజనాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగులు ఒత్తిడికి లోను కాకుండా ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో రెండు దఫాలుగా ఈ కార్యక్రమం చేపట్టింది.
అందులో భాగంగా ఆదివారం ఆదివారం జగిత్యాల, సిరిసిల్ల డిపోల్లో నిర్వహించగా ఉద్యోగులు ఆటాపాటలు, డ్యాన్సులతో రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా జగిత్యాలలో డీఎం సునిత స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) హిమబిందు, సూపరింటెండెంట్ జగదీశ్వరి, మెకానిక్ ఫోర్ మెన్ కవిత పాల్గొన్నారు. సిరిసిల్లలో ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలిచిన వారికి కరీంనగర్ రీజినల్ డిప్యూటీ ఆర్ఎంవో భూపతిరెడ్డి, డిపో మేనేజర్ ఎన్ మనోహర్ బహుమతులు అందించారు.
– జగిత్యాల, జనవరి 7