తిమ్మాపూర్ రూరల్, జనవరి14: మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంక్రాంతి పండుగ పూట పల్లె బాట పట్టారు. తొలిపొద్దులో భాగంగా శనివారం తెల్లవారుజామున పోరండ్ల, మన్నెంపల్లి, మల్లాపూర్, పోలంపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ప్రత్యక్షమయ్యారు. పొద్దుపొడవకముందే ఇంటికి వచ్చిన సారును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆడబిడ్డలు ముంగిళ్లలో ముగ్గులేసి ఆత్మీయ స్వాగతం పలికారు. నుదుట తిలకందిద్ది ‘జై రసమయన్న’ నినాదాలతో హోరెత్తించారు. ఆయాచోట్ల ఎమ్మెల్యే దారివెంట గ్రామస్తులను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకుసాగారు. వృద్ధులతో మాట్లాడి సాదకబాధకాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? మీకేమైనా సమస్యలున్నాయా? అంటూ అడిగారు. లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చీరెపెట్టి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారుల కుటుంబీకులు సంబురంలో మునిగితేలారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, సర్పంచులు రెడ్డి త్రివేణీతిరుపతిరెడ్డి, మేడి అంజయ్య, సతీశ్, బొజ్జ తిరుపతి, తోట మమతామధు, ఆత్మ చైర్మన్ అశోక్రెడ్డి, ఉప సర్పంచ్ అనిల్గౌడ్, నాయకులు ఎలుక ఆంజనేయులు, జలపతి తదితరులు పాల్గొన్నారు.