రాయికల్, డిసెంబర్ 26: కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దాకా ప్రజల పక్షాన ఉండి పోరాడతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం రాయికల్ పట్టణం, మండలానికి చెందిన 27 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాయికల్ వర్తక సంఘంలో చెకులను పంపిణీ చేసి, మాట్లాడారు. కేసీఆర్ సరారు పదేండ్ల పాలనలో ఎన్నో రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు జీవన భృతి, కేసీఆర్ కిట్, ఆరోగ్య మహిళ, మహిళల కోసం గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని, బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. జగిత్యాల నియోజకవర్గంలో 25 వేల మందికి బీడీ పెన్షన్ అందజేసిన ఘనత బీఆర్ఎస్ సరారుదేనని చెప్పారు. తెలంగాణను కాంగ్రెస్ అప్పుల రాష్ట్రంగా చూపే ప్రయత్నం చేస్తూ, హామీలు ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని మండిపడ్డారు. కుల, మత రాజకీయాలు చేస్తున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి, సంక్షేమం చేసే పార్టీలను ఆదరించాలని, అప్పుడే ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మారుతాయన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేద పత్రాన్ని విడుదల చేసి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, 2014 ముందు ఉన్న పరిస్థితిని కండ్లకుకట్టినట్లు చూపించారన్నారు. ప్రతి గ్రామం, వార్డులు, పట్టణాల్లో జరిగే ప్రజా పాలన సభలో ప్రతి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రజల పక్షాన ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, ఏఎంసీ చైర్మన్ రాణి సాయికుమార్, వైస్ చైర్మన్ రమాదేవి, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, రాయికల్ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి రాజేశ్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, సర్పంచులు ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు ముఖీద్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.