ఇబ్రహీంపట్నం, ఆగస్టు 17: బీసీల్లోని కులవృత్తుల వారికి రాష్ట్ర సర్కారు చేస్తున్న లక్ష రూ పాయల సాయం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కితాబిచ్చారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 55 మందికి బీసీ బంధు చెక్కులను, 11 గ్రామాల్లో 40 కుల సంఘాలకు రూ. కోటి 50 వేల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను ఆయా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ బంధు పథకం ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ పథకం కింద నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,600 దరఖాస్తులు వచ్చాయని, విడతల వారీగా ప్రతి నెలా 300 మందికి చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ 3 లక్షల చొప్పున అందిస్తామన్నారు. రూ.లక్ష లోపు ఉన్న రైతులకు ఖాతాలో డబ్బు జమ చేసి రుణమాఫీ చేశామని, లక్షకు పైగా లోన్ ఉన్నవారికి సెప్టెంబరు మొదటి వారంలోగా రుణమాఫీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
రెండో విడత దళితబంధు త్వరలోనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి మూడోసారి సీఎంగా కేసీఆర్కు అవకాశం ఇవ్వాలని కోరారు. మండలంలోని లో లెవల్ బ్రిడ్జిలను హై లెవల్ బ్రిడ్జిలుగా మా ర్చేందుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రా రంభించామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేను కుల సంఘాల ప్రతినిధులు, బీసీ బంధు లబ్ధిదారులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ ఎంపీపీ జాజాల భీమేశ్వరి, వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫో రం మండలాధ్యక్షురాలు నేమూరి లత, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పొనుకంటి వెంక ట్, ఎంపీడీవో కట్కం ప్రభు, నాయకులు జగన్రావు, కమటం రమేశ్, నేమురి సత్యనారాయ ణ, జేడీ సుమన్, నేరేళ్ల దేవేందర్, సురేష్రెడ్డి, తుక్కా రాం, సత్యం, ప్రదీప్కుమార్, పాప న్న, పవన్, రాంరెడ్డి, జీవన్ పాల్గొన్నారు.