Kolanuru | ఓదెల, ఆగస్టు 11 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శఖలాలు కూలిపోయాయి. దీంతో గ్రామస్తులు విరాళాలతో రాతి కట్టడంతో ఆలయాన్ని ఆలయాన్ని యథాతథంగా పునరుద్ధరిస్తున్నారు.
దాదాపు రూ.కోటి యాభై లక్షలతో ఆలయ పునర్నిర్మాణం చేపడుతుండడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయం చుట్టూ సీసీతో ఫ్లోరింగ్ పనులు ప్రారంభించారు. వేద పండితుడు నందగిరి అశోక్ పూజా కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లు బండారి ఐలయ్య యాదవ్, ముస్త్యాల నాగయ్య, ఓదెల నరేందర్తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.