జగిత్యాల రూరల్, జనవరి 5: ప్రజా పాలన నిరంతర ప్రక్రియ అని, ఇక నుంచి నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పాలన పరిశీలకురాలు దేవసేన పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం ఒడ్డెర కాలనీ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ దివాకర్తో కలిసి ఆమె పరిశీలించారు.
దరఖాస్తుదారులతో కాసేపు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన నిరంతర కార్యక్రమమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ మండల ప్రత్యేకాధికారి ఖాన్, డీపీవో దేవరాజు, ఆర్డీవో నర్సింహమూర్తి, ఎంపీడీవో రాజేశ్వరి, ఎంపీవో రవిబాబు, సర్పంచ్ రాజమణిగంగాధర్, కార్యదర్శి ప్రవీణ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.