నాకు ఎకరం పదహారు గుంటల భూమి ఉన్నది. మునుపు పెట్టుబడికి ఎనుకా ముందయ్యేది. తెలంగాణ అచ్చినంక రైతులను అన్ని విధాలా సర్కారు ఆదుకుంటున్నది. మాకు చానా మేలు జరుగుతంది. పొద్దంతా కరెంటు, అప్పు మాఫీ, పుష్కలంగా సాగుకు నీళ్లతో ఎవుసం సాఫీగా సాగిపోతంది. రైతుబంధు కింద అచ్చిన పైసలతో ఎరువులు, విత్తనాలు కొంటున్న. కడమ పైసలు కూలీలకు ఖర్చు చేస్త. మళ్లోసారి కూడా ఈ సర్కారే రావాలని కోరుకుంటున్న. నాకు పసలుకు ఏడువేలు వత్తయ్. పంట పెట్టుబడికి రంది లేదు.
– వూరడి బక్కారెడ్డి, ఇప్పల్ నర్సింగాపూర్(హుజూరాబాద్)
రెండు రోజుల్లో జిల్లాల వారీగా ఖాతాల్లో పడ్డ రైతుబంధు వివరాలు