Chigurumamidi | చిగురుమామిడి, జూలై 28 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కు రూ.10 లక్షల బ్యాంకు డిపాజిట్ పత్రాలను హైదరాబాదులో మంగళవారం అందజేశారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లో ఆలయ అభివృద్ధికి టెండర్లకు పిలవనున్నట్లు హామీ ఇచ్చారు.
డిపాజిట్ పత్రాలను అందజేసిన వారిలో ఆలయ చైర్మన్ కొలిపాక వేణు, పాలకవర్గ సభ్యులు కాసాని సతీష్, కారంపూరి వెంకటేశం, మామిడి అంజయ్య, అన్న సదానందం, బిల్ల తిరుపతిరెడ్డి తదితరులున్నారు. చాలా సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఆశిస్తున్న కలలు నెరవేరుతుండడంతో హర్షం వ్యక్తం చేశారు.