ధర్మపురి, ఏప్రిల్ 1: స్తంభంపల్లిలో క్రిభ్కో సహకార సంస్థ సహకారంతో ప్రభుత్వం నెలకొల్పనున్న ఇథనాల్ పరిశ్రమను డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ అడ్డుకునే ప్రయత్నం చే యడం ఈ ప్రాంత వాసులకు చేస్తున్న ద్రోహమేనని డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీ మాంధ్ర పాలనలో ధర్మపురి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఈ ప్రాంతంలో ఎలాం టి పరిశ్రమలు లేక కేవలం రైస్మిల్లులు మాత్రమే ఉండి యువతకు ఉపాధి కరువైందన్నారు. ఈ ప్రాంత రైతులకు మేలు చేయడంతో పాటు యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంలో మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను ఒప్పించి ఇథనాల్ పరిశ్రమను ధర్మపురి ని యోజకవర్గానికి తీసుకువచ్చారన్నారు.
ఈ మేరకు గతేడాది క్రిభ్కో సంస్థ ప్రతినిధులు స్తంభంపల్లికి వచ్చి అక్కడున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి అనుకూలమైనదిగా గుర్తించారని తెలిపారు. క్రిభ్ కో సంస్థ దేశంలోనే అతిపెద్ద సహకార సంస్థ అని కొనియాడారు. ఈ సంస్థ ద్వారా దేశ రైతాంగానికి ఏటా 45లక్షల టన్నుల యూరియా, 20 లక్షల టన్నుల డీఏపీని అందిస్తుందని వెల్లడించారు. 10 లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో, 10వేల సహకార సంఘాల సమూహమే క్రిభ్కో సంస్థ అని తెలుసుకోవాలన్నారు. ఇది కేవలం రైతాంగానికి ఉపయోగపడే పరిశ్రమలు నెలకొల్పే సంస్థ అన్నారు. ఈ సంస్థ దేశంలో కేవలం మూడు రాష్ర్టాల్లో ఇథనాల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకువచ్చిందని వెల్లడించారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఒకటని, మన వెల్గటూర్ మండలంలో ఏర్పాటు చేస్తుండడం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణతో పాటు గుజరాత్లోని సూ రత్, ఏపీలోని నెల్లూర్ జిల్లా కృష్ణపట్నంలో ప్రాజెక్టులను నెలకొల్పుతున్నదని వెల్లడించారు.
ఈ పరిశ్రమ ద్వారా 200 మంది యువకులకు పర్మినెం ట్ ఉద్యోగావకాశాలు, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏటా 6లక్షల టన్నుల ధాన్యం, మక్కజొన్న, తడిసిన ధాన్యానికైనా మద్దతు ధర ఇచ్చి మన రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తున్నదన్నారు. పరిశ్రమకు రోజూ 2500 గ్యాలరీల నీరు అవసరముంటుందని వెల్లడించారు. అలాగే ఈ క్రిభ్కో సంస్థ ఆధ్వర్యంలో 35వేల నుంచి 50 వేల టన్నుల గో దాములు నిర్మిస్తారన్నారు. జిల్లాలో పండే వరి, మక్కను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తారన్నారు. అయితే భూమిని చదును చేసి ఇవ్వాలని సంస్థ ప్ర తినిధులు కోరారని తెలిపారు. ఇందుకు మంత్రి కేటీఆర్ను ఒప్పించి పరిశ్రమల శాఖ ద్వారా మరో రూ.13కోట్లను మంత్రి ఈశ్వర్ మంజూరు చే యించి భూమి చదును పనులను ప్రారంభించారన్నారు.
ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే మంత్రి కొప్పుల ఈశ్వర్ తపనతో కృషి చేస్తున్నారని కొనియాడారు. వందల సంవత్సరాలుగా పడావు బడ్డ ప్రభుత్వ భూమిలో పరిశ్రమను నెలకొల్పితే అభ్యంతరం ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరు అడ్డుకున్నా ఈ పరిశ్రమ నెలకొల్పడం ఆగదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇది తొలిమెట్టు మాత్రమేనని, దీని అ నుబంధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దీని వల్ల ప్రజల జీవన ప్ర మాణాలు పెరుగుతాయని తెలుసుకోవాలని సూ చించారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నందుకు జిల్లా రైతాంగం పక్షాన, యువత పక్షాన మంత్రి ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమా ర్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు సౌళ్ల భీ మయ్య, పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇం దారపు రామన్న, మున్సిపల్ కౌన్సిలర్లు అనంతు ల విజయలక్ష్మి, సయ్యద్ యూనస్, తిర్మందాసు అశోక్, తరాల కార్తీక్, కో ఆప్షన్ సభ్యుడు అలీం, ఆర్బీఎస్ పట్టణాధ్యక్షుడు వొడ్నాల మల్లేశం, పీఏసీఎస్ డైరెక్టర్ పెరుమాండ్ల ఎల్లాగౌడ్, దేవస్థానం రెనొవేషన్ కమిటీ సభ్యులు చుక్క రవి, సురేందర్, నాయకులు సంగి శేఖర్, చిలివేరి శ్యాం సుందర్, అనంతుల లక్ష్మణ్, చీర్నేని నర్సయ్య, గడ్డం బాలరాజు, పందిరి తిరుపతి, ఎండీ షబ్బీర్ ఉన్నారు.