పెద్దపల్లి, మార్చి 18 : బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి దాసరి ఉష బీఆర్ఎస్లో చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి ఆమె, ఆమె తండ్రి హన్మయ్య బీఆర్ఎస్లో చేరగా, పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఉషతో పాటు పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన దాదాపు 200 మంది బీఎస్పీ నాయకులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, 10,315 ఓట్లు సాధించారు.