వేములవాడ రూరల్, జూలై 8: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే తిరుపతి దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చని రాజన్న ఆలయ ఈవో రమాదేవి పేర్కొన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్టాండ్లో తిరుపతి వెళ్తున్న భక్తులకు శుక్రవారం దర్శనం టికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ తిరుపతి వెళ్లే భక్తులు వారం ముందు గా ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకుంటే దర్శనం టికెట్ను కూడా అందజేసే సౌకర్యం తెలంగాణ ఆర్టీసీ కల్పించిందన్నారు.
తిరుపతి వెళ్లే వారు ముందస్తుగా ఆన్లైన్లో బస్సుటికెట్, దర్శనం టికెట్ రెండు కలిపి రూ 2,830 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశం కల్పించిన ఆర్టీసీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి వెళ్లే వారికి ఇది మంచి అవకాశమన్నారు. అనంతరం డిపో మేనేజర్ భీమ్రెడ్డి మాట్లాడుతూ వేములవాడ నుంచి తిరుపతికి ప్రతి రోజూ లగ్జరీ బస్సును నడిపిస్తున్నామన్నారు. భక్తులు ముందుగా ఆర్టీసీ బస్ టికెట్తోపాటు దర్శనం టికెట్ను బుక్ చేసుకునే అవకాశం ఆర్టీసీ కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ డీఈ రాజేశ్, ఎస్టీఐ వర్జిలాల్, టికెట్ బుకింగ్ శ్రీనివాస్, పీఆర్వో శ్రీనివాస్ యాదవ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.