ధర్మపురి/ధర్మారం, నవంబర్ 25: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలను అందరికీ తెలియజెప్పేలా ధర్మపురి నియోజకవర్గంలో ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారితో నేటి నుంచి నృత్యరూప నాటక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర మంత్రి కొ ప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో టీ(బీ)ఆర్ఎస్ నాయకులతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమసమాజ స్వాప్నికుడు, నవభారత నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న, అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నా రు. సమసమాజాన్ని కోరుకున్న గొప్ప సంస్కర్త, జాతీయ నేత అయిన అంబేద్కర్ను కొందరికి సంబంధించిన నాయకుడిగా ఇప్పటికీ పరిగణించడం శోచనీయమన్నారు. అంబేద్కర్ అం దరివాడని,ఆదర్శనీయుడనీ, ఆయన జీవిత వి శేషాలు, ఆశయాలు, లక్ష్యాలను నేటి తరానికి తెలియజెప్పేందుకు ఎల్ఎం కొప్పుల సో షల్ సర్వీసెస్ ఆర్గనేజైషన్ సంకల్పించిందన్నా రు. ఇందులో భాగంగా ఇప్పటికే వందలాది ప్రదర్శనలిచ్చిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వా రితో ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని మం డలాల్లో ‘సంఘం శరణం గచ్చామి’ నృత్య నా టక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వివరించారు..
నేటి నుంచి డిసెంబర్ 2వరకు ప్రదర్శనలు..
ధర్మపురి నియోజకవర్గంలో నేచి నుండి డిసెంబర్ 2వరకు సంఘం శరణం గచ్చామి నృత్య నాటక ప్రదర్శనలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈనెల 26న సాయంత్రం 6గంటలకు వెల్గటూర్లోని అంబేద్కర్ చౌక్ వద్ద, 27న గొల్లపెల్లిలోని ముస్కు శ్యాంసుందర్రెడ్డి ఫంక్షన్ హాల్లో సాయంత్రం 6గంటలకు, 28న సా యంత్రం 6గంటలకు పెగడపల్లిలోని పద్మనాయక కల్యాణ మండపంలో, 29న సాయం త్రం 6కు బుగ్గారంలోని గడి ప్రాంగణంలో, 30న సాయంత్రం 6గంటలకు ధర్మపురి మం డలం దోనూర్లో, డిసెంబర్1న ధర్మారం మం డలం ఖిలావనపర్తి లక్ష్మీనర్సింహస్వామి ఫం క్షన్హాల్లో, 2న సాయంత్రం 6గంటలకు ఎం డపెల్లి మండలం రాజారాంపల్లి ఎస్సార్ గా ర్డెన్స్లో ప్రదర్శన నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు. కార్యక్ర మంలో సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.