మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్లో జడ్పీ చైర్పర్సన్తో కలిసి దళితబంధు యూనిట్ ప్రారంభం
వెల్గటూర్, జూన్ 27: రాష్ట్రంలోని దళితులు దళితబంధు పథకంతో ఏడేళ్ల కాలంలో పూర్తిగా ధనికులవుతారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో చెన్న మెగిళి అనే దళితబంధు లబ్ధిదారు ఏర్పాటు చేసుకున్న ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్ యూనిట్ను మంత్రి కొప్పుల, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని అన్నారు. దళితులకు మంచి చేయాలనే సంకల్పంతో దళితబంధు పథకాన్ని చేపట్టి రూ.17,800 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు. దశల వారీగా ఈ పథకాన్ని అందరికీ అందించి దళితుల్లో పేదవారు లేకుండా చే యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఇప్పిస్తానని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
స్వయంగా తానే దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను మంత్రి సన్మానించారు. అనంతరం కోటిలింగాల ఆలయ పరిసరాల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. సంకెనపల్లిలో సుమారు రూ.35లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, సర్పంచులు ముల్కల్ల గంగారాం, మేర్గు కొముర య్య, మారం జలేందర్రెడ్డి, ఎంపీటీసీలు సప్ప జ్యోతి-రాజు, మూగల రాజేశ్వరి-సత్యం, కో ఆప్షన్ సభ్యులు ఎండీ రియాజ్, ఎంపీడీవో ఆకుల సంజీవరావు, వెల్గటూర్ పట్టణ శాఖాధ్యక్షుడు రంగు తిరుపతి గౌడ్, ఏఈ రాజ్కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సింహాచలం జగన్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్, నాయకులు పెద్దూరి భరత్, కుమ్మరి వెంకటేశ్, అంబటి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.