మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు
జమ్మికుంట రూరల్, జూన్ 6: దళిత బంధు పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు సూచించారు. పట్టణానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు ఆరెల్లి సంధ్య, లింగంపల్లి సరోజన ఏర్పాటు చేసుకున్న లేడీస్ బ్యూటీ పార్లర్, పీవోపీ డెకొరేటర్స్ షాపులను సోమవారం వార్డు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. దళిత బంధు గొప్ప పథకమని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు రావికంటి రాజ్కుమార్, కాల్వల దీప్తి, పాతకాల రమేశ్, మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేశ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
బిజిగిరిషరీఫ్లో..
మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామంలో దళితబంధు లబ్ధిదారులు లక్ష్మీపోచయ్య ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపును సోమవారం సర్పంచ్ రాచపల్లి సదయ్య, ఎంపీటీసీ రాచపల్లి రాజయ్య, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు ప్రారంభించారు. ఇక్కడ మాజీ సర్పంచ్ యుగంధర్రెడ్డితో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.