Tarupalli | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 6 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ గాజనవేన స్వరూప-సదయ్య మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లు టీ రమేశ్, బీ రాజేందర్, ఉప సర్పంచ్ ఆముదాల స్వామి, కార్యదర్శి ముత్యాల సందీప్, ఉపాధ్యాయ సిబ్బంది సంపత్కుమార్, వాసు, విద్యార్థులు పాల్గొన్నారు.