యాసంగి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ యేడు ఆశించిన స్థాయిలో వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నిండుకుండలుగా మారగా, సాగు పండుగ కాబోతున్నది. ఈసారి 10,51,178 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ యంత్రాంగం అంచనా వేసింది.
గత యాసంగితో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా పెరిగింది. అందులో అత్యధికంగా 9,49,422 ఎకరాల్లో వరి సాగుచేసే అవకాశముందని, మిగతా విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు వేస్తారని లెక్కగట్టింది. ఇప్పటికే చాలా చోట్ల రైతాంగం వరినార్లు పోయగా, వందలాది ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నది. మరోవైపు రైతులకు కావాల్సిన పలు రకాల విత్తనాలను యంత్రాంగం అందుబాటులో ఉంచింది. మిగిలినవి తెప్పించే పనిలో నిమగ్నమైంది.
కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఒక పక్క వానకాలం పంట ఉత్పత్తులను విక్రయి స్తూనే జిల్లా రైతులు యాసంగి సాగులో నిమగ్నమ య్యారు. తుఫాన్ ప్రభావంతో ధాన్యం విక్రయాల కు కొంత అంతరాయం కలిగినా జిల్లా యంత్రాం గం అప్రమత్తమై కొనుగోళ్లను వేగవంతం చేసింది. ఇటు యాసంగి సాగుకు రైతులు వరి నార్లు పోసు కుంటున్నారు. హుజూరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, సుల్తాన్బాద్, ఎలిగేడు మండలాల్లో ఇప్పటికే రైతులు నాట్లు వేస్తున్నారు.
మక్క, ఆరుతడి పంటలు కూడా సాగవు తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా వ్యవసాయ అధికారులు వరికి ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళిక రూపొందించారు. వర్షాలు అనుకూలించి, భూగర్భ జలాలు పుష్క లంగా ఉన్న ప్రాంతాల్లో బావులు, బోర్ల కింద పెద్ద మొత్తంలో వరి సాగయ్యే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ప్రాజెక్టుల్లో కూడా అను కూలంగా నీరు ఉన్నందున ఆయకట్టు, చెరువుల పారకం ప్రాంతాల్లో కూడా వరి సాగు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కువగా వరికే మొగ్గు చూపుతున్నారు. అధికారులు కూడా అందు కు తగినట్లుగానే ప్రణాళిక సిద్ధం చేశారు.
జిల్లాలో వరికి అగ్రస్థానం కల్పిస్తూ 2023-24 యాసంగి ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, మక్క 25 వేలు, పెసర 50, పత్తి 90, మినుములు 35, నువ్వులు 30, పల్లి 450, పసుపు 10, పొద్దుతిరుగుడు 350, పొగాకు 150, ఇతర పంటలు మరో 5,983 ఎకరాల్లో కలిపి 3,00,178 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు వరి 2,925, మక్క 1,298, పెసరా 2, బబ్బెర 19, పల్లి 210, పొగాకు అంచనాకు మించి 156, ఇతర పంటలు మరో 102 ఎకరాల్లో సాగైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు.
జిల్లాలో సాగు అంచనాలను బట్టి వ్యవసాయ అధికారులు ఎరువుల కోసం సిఫారసు చేస్తుంటారు. ఈ సీజన్లో 42,626 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటి వరకు 1,275 మెట్రిక్ టన్నుల వాడకం జరిగింది. ఇంకా 11,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ విషయానికి వస్తే 8,477 మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా ఇప్పటికే 77 మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 7,441 మెట్రిక్ టన్నుల నిలువ ఉంది. కాంప్లెక్స్ 22,258 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఇప్పటికే 526 మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 25,164 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఎంఓపీ 6,124 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఇప్పటికే 386 మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 2,301 మెట్రిక్ టన్నులు నిలువ ఉంది. అవసరం మేరకు, రైతులు వాడుకునే విధానాన్ని బట్టి ఎరువులు అందుబాటులో ఉంచుతామని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.
జిల్లాలో ఈ యాసంగి సాగుకు 66,749మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ఇందులో 16,644మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా 7250, డీఏపీ 1601, కాంప్లెక్స్ 6885, ఎంఓపీ 507, ఎస్ఎస్పీ 399మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. వరి నాట్లు ఈ నెల చివరి వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంకా అవసరమైన ఎరువులను తెప్పిస్తాం.
– దోమ ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి (పెద్దపల్లి)
ఈ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో పంటలు రైతులు సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నాం. వానాకాలం వరి పంట కోతలు దాదాపు పూర్తయ్యాయి. జిల్లాలో 3,03,000 ఎకరాల్లో వరి సాగుకుగాను డిసెంబరు మొదటి వారంలో సుమారు 25 ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. మిగితా రైతులు నాటు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మక్క 27,200 ఎకరాల్లో అంచనాకుగాను ప్రస్తుతం 19 వేల ఎకరాల్లో సాగు ప్రారంభించారు. డిసెంబరు చివరి వారం వరకు దాదాపు వరి నాట్లు పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నాం.
– పీ సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ( జగిత్యాల)