వేములవాడ టౌన్, మార్చి 25 : వేములవాడ రాజన్న క్షేత్రానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయ గర్భగుడిలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో ఎంతో భక్తిశ్రద్ధలతో తలనీలాలను సమర్పించుకున్నారు. గంటల తరబడి నిలబడి రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు.
ఆలయంలో భక్తు లు శీఘ్ర, ధర్మ దర్శనం జిగ్జాగ్ క్యూల మీదుగా ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో దంపతులు కల్యాణ మొక్కులు తీర్చుకున్నారు. రాజన్నను దాదాపు 10 వేలకు పైగా భక్తు లు దర్శించుకున్నారని, రాజన్నకు సుమారు రూ.14 లక్షలకు పైగా ఆదాయం సమకూరిన ట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.