మేడారం జాతర సమీపిస్తున్నందున వేములవాడ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారిని సుమారు 50వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని, వివిధ ఆర్జిత సేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.32లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
అనుబంధ దేవాలయాల్లోనూ రద్దీ నెలకొన్నది. ఆలయ ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
– వేములవాడ టౌన్, ఫిబ్రవరి 4