Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 15 : చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఐలేని రాజవ్వ నిరుపేద కుటుంబానికి చెందిన ఆవు మంగళవారం మృతి చెందింది. కుటుంబంలో రాజవ్వ కొన్ని సంవత్సరాల క్రితం భర్తతో పాటు కొడుకు కూడా మృతి చెందింది. దీంతో ఆవు ద్వారా వచ్చే పాలతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తోంది.
గ్రామంలో పిచ్చికుక్క ఆవును కరవడంతో ఆవు మృతి చెందడం జరిగిందని ఇందుర్తి పశువైద్యాధికారి సాంబారావు నిర్ధారించినట్లు సర్పంచ్ బోయిని రమేష్ తెలిపారు. నిరుపేద కుటుంబానికి జీవనాధారం కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన రాజవ్వ కు ప్రభుత్వం రాష్ట్ర పరిహారం చెల్లించాలని సర్పంచ్ కోరారు.