హుజూరాబాద్\హుజూరాబాద్టౌన్, జూన్ 22: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. పట్టణంలో రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మున్సిపల్ వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినదించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని మండలి విప్ కౌశిక్ రెడ్డి ఆవిష్కరించారు. అమరవీరులకు మౌనం పాటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజూరాబాద్ను మరో సిద్దిపేట, సిరిసిల్ల తరహా తీర్చిదిద్దుతానని, ఇందుకోసం కేసీఆర్ను మెప్పించి అభివృద్ధికి నిధులు తెస్తానని పేరొన్నారు. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరవేసి ఎమ్మెల్యే సీటును సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని వేడుకున్నారు.
నియోజకవర్ంగ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను తప్పకుండా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని, మొన్నటి ఉప ఎన్నికలో కేసీఆర్ పుణ్యమా అని నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి మంత్రి నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారితే ఇకడ మాత్రం అభివృద్ధి ఎందుకు జరుగలేదని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కేవలం తన ఆస్తులను పెంచుకునేందుకు సమయం వెచ్చించాడే తప్పా ప్రజల, అభివృద్ధి పనుల గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక అవకాశం ఇస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా హుజూరాబాద్ గౌరవం పెంచేందుకు కృషి చేస్తానని వినయంతో చెప్పారు. నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ.7వేల కోట్లకు పైగా బీఆర్ఎస్ సర్కారు వెచ్చించిందన్నారు. ప్రతి కార్యకర్త వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీలు ఇరుమల్ల రాణి, ముసిపట్ల రేణుక, మమత, సరిగొమ్ముల పావని, లాండిగే కళ్యాణి, ఆర్డీవో హరిసింగ్, ఏసీపీ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ కే లావణ్య, తదితరులు పాల్గొన్నారు.