సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 18: కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి ఆరోపణలు చేయడం మానుకోవాలి.. చేతనైతే మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించండి.. అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్ల మధు సవాల్ విసిరారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో కాలువల ద్వారా నీటిని విడుదల చేయగా, అందు కు సంబంధించిన ఫొటోలను ఆదివారం తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులోని కాలువల వద్ద ప్రదర్శించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేకే మహేందర్రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల ప్రయోజనం కోసం అహర్నిశలూ శ్రమించి నీళ్లు తెచ్చిన వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు.
సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టర్లకు అదేశాలు ఇచ్చి, కాలువలు పూర్తి చేయించిన ఘనత రామన్నదేనన్నారు. సిరిసిల్లకు కేటీఆర్ ఏం చేయలేదని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైతులపై ప్రేమ ఉంటే నీళ్లు తెచ్చేలా పనులు చేయాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో సైతం నీళ్లు తెచ్చి చెరువులను నింపామన్నారు. మరోసారి కేటీఆర్పై విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొయ్యడ రమేశ్, నాయకులు కొమ్మిటి రాజిరెడ్డి, సతీశ్రెడ్డి, తిరుపతిరెడ్డి, అబ్బాడి అనిల్రెడ్డి, సిలువేరి చిరంజీవి, భాస్కర్రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, సత్తిరెడ్డి, నర్ర నరేందర్రెడ్డి, అఫ్రోజు, రవి, బండి మల్లయ్య, రాజిరెడ్డి, లక్ష్మీనారాయణ, దేవరాజ్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.