పెద్దపల్లి, నవంబర్16: యాభైఏండ్లు పాలించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ను ఆసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాతరేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదన్నరేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసిన బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి, జూలపల్లి మండలం వెంకట్రావ్పల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 30న నిర్వహించే పోలింగ్లో గులాబీ పార్టీకి ఓట్ల జాతర సాగుతుందన్నారు. అధికారం ఉన్నప్పుడు చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏదో చేస్తామని మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటే దిక్కువుతుందని, కారు ఓటేస్తే 3 పంటలు సమృద్ధిగా పండేందుకు కరెంట్, సాగునీరు అందుతుంద న్నారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమావ్యక్తం చేశారు.
పెద్దపల్లి 9వవార్డు కాంగ్రెస్కు చెందిన సయ్యద్ జుబేర్, 11వ వార్డుకు చెందిన యూత్ కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు ఎండీ యాకూబ్, 28వ వార్డు బీజేపీ అధ్యక్షుడు కనమల్ల ప్రదీప్ కుమార్ చేరారు. ఇక్కడ పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ జడల సురేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్, కౌన్సిలర్ పూదరి చంద్రశేఖర్, నాయకులు వైద శ్రీనివాస్, పూదరి చందు, అజ్మత్, మహబూబ్, మహమ్మద్ సలీం, యాకు బ్, ఉప్పు రమేశ్, మాడిశెట్టి తిరుపతి, బైరం నటరాజ్, దుస్స అశోక్, గుర్రం అనిల్ కుమార్, బొల్లం అనిల్కుమార్, యాకూబ్, షకిల్, అజార్, కీర్తి అనిల్ కుమార్ పాల్గొన్నారు.
వెంకట్రావుపల్లికి చెందిన మహంకాళి రత్నం, కొమ్మ సది, దాడి మల్లయ్య, మల్లెత్తుల కొంర య్య, అంజయ్య, అజయ్, మహంకాళి చిన్న, రా జయ్య, తిరుపతి, బాపు, లచ్చన్న, రవి, ఐలయ్య, కుమార్, లింగయ్య ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె స్వరూప, ప్రసాద్, దుగ్యాల వెంకట్రావు, మచ్చ యాదగిరి, బడుగు ఈశ్వర్, గ్రామాధ్యక్షుడు మల్లయ్య, కొమ్మ సతీశ్ పాల్గొన్నారు.