ఇల్లంతకుంట, ఆగస్టు 7 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్కు చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో ఆ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్నదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తున్నారన్నారు.
తిప్పాపూర్ మాజీ సర్పంచ్ భర్త బొళ్లవేని రమేశ్, అవారు బాబు, లక్ష్మణ్, భూమయ్య తోపాటు 50 మంది అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చింతల వేణురావుతోపాటు తదితరులు ఉన్నారు.