మెట్పల్లి, డిసెంబర్ 28 : విద్యావ్యవస్థను మరింతగా పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మె ల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్న త, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బంటుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, శిలాఫలకాలను ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యనందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతకుముందు గణిత శాస్త్రంలో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థినులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందించా రు.అదే విధంగా ఆయా పాఠశాలల్లో ఎమ్మెల్యేను ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్రావు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కోనరావుపేట ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రూ.98 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్కారు బడుల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్కుమార్, సర్పంచ్ కోరెపు శ్యామల, ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఎంపీడీవో భీమేశ్రెడ్డి, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు అనిరెడ్డి మారుతి, ఉప సర్పంచ్ మా రు జనార్దన్, విద్యా కమిటీ చైర్మన్ ఆర్మూర్ జమున, వీడీసీ అధ్యక్షుడు పెంట ప్రవీణ్, నాయకులు కోరెపు మురళి, జక్కని పరంధాం, మ్యాడపు సతీశ్రెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20లక్షల నిధులు మంజూరు చేయడంపై స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేయించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావును గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బుధవారం మెట్పల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ సర్పంచ్ కడకుంట్ల సాయికుమార్, ఎంపీటీసీ మైస లక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ నేరెళ్ల మోహన్రెడ్డి, ఆర్బీఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నూతుల లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.